Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి - విజయవాడ మెట్రో రైలు... రాజధాని ఇటే...

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (20:24 IST)
విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణంపై ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ప్రాధమిక పరిశీలన పూర్తి చేసినట్లు శ్రీధరన్ తెలిపారు. విజయవాడ, మంగళగిరిని కలుపుకుని 30 కిలోమీటర్ల పొడవైన మెట్రోరైలు మార్గాన్ని నిర్మిస్తామనీ, ప్రతి కిలోమీటర్‌కు ఒక రైల్వే స్టేషన్ ఉంటుందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడకు ఆవల కాదనీ, ఈవల అంటే... మంగళగిరి - విజయవాడ మధ్యే అని తేలిపోయింది. 
 
శ్రీధరన్ మెట్రో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అధికారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. మెట్రో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదని, దీనివల్ల లాభాలు వస్తాయని అనుకోలేమనీ, కేవలం సేవాభావంతో మాత్రమే నిర్మించవలసి ఉంటుందన్నారు.
 
2015 జనవరి చివరినాటికి ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అలాగే గుంటూరుకు విస్తరిస్తారా అని అడిగినప్పుడు అది సాధ్యం కాదన్నారు. ఆర్థికంగా చాలా కష్టతరమైనదనీ, ఒకవేళ రెండో విడతలో ఏమయినా చేపట్టే అవకాశం ఉండవచ్చన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments