Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి.. ఆపై ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 5 మే 2019 (12:21 IST)
విజయవాడలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త ఒకరు.. ఆమెను గొడ్డలితో నరికి చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని జక్కంపూడి కాలనీకి చెందిన నరసింహా రావు(56), కృష్ణాకుమారి(47) అనే దంపతులు ఉన్నారు. వీరికి 25 యేళ్ల క్రితం వివాహమైంది. వీరి పిల్లలకు కూడా వివాహాలు జరిగాయి.
 
వీరి సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో భార్యపై భర్తకు అనుమానం మొదలైంది. దీంతో వారిద్దరి మధ్య రోజూ గొడవలు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజుల క్రితం భార్యతో నరసింహా రావు గొడవపెట్టుకున్నాడు. దీంతో భార్య ఇంటిని తన అక్కగారింటికి వెళ్లింది. భార్యకు భర్త ఫోన్ చేసి క్షమించాలని కోరడంతో పాటు ఇంటికి రమ్మని కబురుపంపాడు. 
 
పైగా, భర్త ఇంటికి వచ్చేసరికి భార్య నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన భర్త.. గొడ్డలి తీసుకొని భార్య నుదిటిపై ఒక్క వేటు వేశాడు. ఈ దాడిలో భార్య ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నరసింహా రావు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనయుడు జాఘవా తలుపులు కొట్టినా ఎంతకు తీయకపోవడంతో బలవంతంగా తలుపులను తెరిచి చూసేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. జాఘవా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments