Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడితో తిరుగుతోంది... పరువు పోతోంది... అందుకే నా కుమార్తెను హత్య చేశా... తల్లి వాంగ్మూలం

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే కూతురిని దారుణంగా వేరే మతస్తుడిని ప్రేమించిందన్న సాకుతో కన్న కూతురిని హత్య చేసింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. అయితే ఈ విషయంలో భార్య చేసిన నేరానికి తప్పుబట్టాల్సిన భర్త అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. కృష్

Webdunia
గురువారం, 7 జులై 2016 (13:56 IST)
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే కూతురిని దారుణంగా వేరే మతస్తుడిని ప్రేమించిందన్న సాకుతో కన్న కూతురిని హత్య చేసింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. అయితే ఈ విషయంలో భార్య చేసిన నేరానికి తప్పుబట్టాల్సిన భర్త అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. పెళ్లయిన వ్యక్తితో ప్రేమ పేరుతో తిరుగుతుందని, తాను ఎంత చెప్పినా న‌జ్మ వినలేదని ఆమె ఆగ్రహం చెందింది.
 
ఈ విషయమై తల్లికూతురికి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ కూడా కూతురు తన మాట వినకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మంగళవారం రాత్రి నిద్ర పోతున్న కుమార్తె నజ్మా ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
 
బుధవారం ఉదయాన్నే విషయం బయటకు పొక్కకుముందే కడుపు నొప్పితో తన కూతురు చనిపోయిందని అందరినీ నమ్మించింది. అయితే నజ్మాను ప్రేమించిన దీపక్ యువకుడికి ఈ విషయం తెలియడంతో పోలీసులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీబీని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించింది.
 
తను వారించినా వినకుండా తన కూతురు వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని అందుకే హత్య చేశానని విచారణలో నిజాన్ని అంగీకరిచింది. తన కూతురు కంటే తమకు పరువే ముఖ్యమని ఆమె చెప్పడం విశేషం. కుటుంబం పరువు తీస్తున్న కారణంగానే తన కూతురిని హత్య చేశానని ఆమె చేసిన నేరాన్ని నిర్భయంగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
 
ఈ క్రమంలో అక్కడకు వచ్చిన బీబీ జాన్ భర్త మైసూర్ ఖాన్‌లో కూడా కూతురు చనిపోయిందన్న బాధ ఏ మాత్రం కనిపించలేదు. భార్య వాదనకే అతడు కూడా మద్దతు పలకడం విశేషం. కన్న కూతురి కంటే పరువు ముఖ్యమని మీడియా ముందు చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. కూతురు విషయంలో తన భార్య చేసిన పని తనకు తప్పుగా కనిపించడం లేదని చెప్పాడు.
 
కాగా నజ్మా ప్రియుడు దీపక్ ఈ రోజుల్లో కూడా పరువు కోసం కన్నకూతుర్ని హతమార్చడం దారుణమన్నాడు. తమ వివాహానికి నజ్మా తల్లి కూడా అభ్యంతరం చెప్పలేదని, అయితే ఇలా చేస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు. చలాకీగా ఉండే నజ్మా హఠాత్తుగా అనారోగ్యంతో మృతి చెందినదని చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అయితే నజ్మా తాను ఎప్పుడూ బయట తిరిగింది లేదని దీపక్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments