Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

ఐవీఆర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (20:30 IST)
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించి మీడియాలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని వైఎసార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్తుల పంపకంపై వాస్తవాలు ఏమిటో బహిరంగ లేఖ ద్వారా తెలియజేసారు. ఆస్తుల పంపకం అనేది జరగలేదని తేల్చి చెప్పారు. 
 
విజయసాయిరెడ్డి గారు ఆడిటర్ గా వున్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసనీ, వైవీ సుబ్బారెడ్డిగారు మా ఇంటి బంధువుగా ఎంవోయుపై సంతకం కూడా చేశారు. కానీ మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. వైఎస్సార్ కోరింది ఒకటే... ఆస్తుల పంపకం జగన్-షర్మిలకు సమంగా పంచాలన్నది. ఇప్పటివరకూ అసలు ఆస్తుల పంపకమే జరగలేదు.
 
నాకు నా ఇద్దరు బిడ్డలు సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. ఐతే అన్యాయం జరుగుతున్నవారికి న్యాయం చేయడం నా ధర్మం కనుక షర్మిలకు చెందాల్సినది చెంది తీరాల్సిందేనని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదనీ, వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు కనుక వాళ్లే తేల్చుకుంటారనీ, ఈ విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని అభ్యర్థిస్తున్నట్లు ఆమె విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments