Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా... పప్పు తిని పడుకో చిట్టయ్యా...

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (20:12 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని వైపాకా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
 
గురువారం పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులోకి వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు కనెక్ట్ అయి లోకేష్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారి ఆడియోతో పాటు వీడియోను కట్ చేశారు. 
 
అదేసమయంలో విద్యార్థుల ఐడీలతో తన జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యేలపై లోకేష్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే నేరుగా తనతో చర్చకురావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 
 
ఈ సవాల్‌పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "జూమ్‌ మీటింగ్‌లోకి వస్తేనే తట్టుకోలేక మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments