Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలను మోసం చేయడంతో చంద్రబాబు గిన్నిస్ రికార్డు : విజయసాయి రెడ్డి

Webdunia
సోమవారం, 25 మే 2015 (17:16 IST)
ప్రజలను మోసం చేయడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిన్నిస్ రికార్డులకెక్కుతారని వైకాపా అధికార ప్రతినిధి విజయసాయి రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సర్కారు వైఫల్యాలను తమ పార్టీ ఎండగడుతుందన్నారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన బాబు... అధికారం చేపట్టాక చేసిన తొలి ఐదు సంతకాలను అమలు చేయకుండా అభాసుపాలు చేశారన్నారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్న విజయసాయి, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో బాబు గిన్నిస్ రికార్డుకెక్కుతారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో వైసీపీ సమరదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments