Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ వరదల‌పై ప్రధానమంత్రి, హోం మంత్రితో మాట్లాడిన ఉప రాష్ట్రపతి

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (14:10 IST)
ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని వరద పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద బాధితుల దృశ్యాలు త‌న‌ని క‌లచివేశాయ‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. వ‌ర‌ద‌ల విష‌య‌మై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఈ రోజు ఉదయం ఫోన్ ద్వారా రాష్ట్రంలో వరద పరిస్థితిని  వారికి వివరించారు. 
 
 
ఆంధ్ర రాష్ట్రంలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను, భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రధానికి తెలియజేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, వరద ప్రభావం గురించి కూలంకషంగా వివరించారు. వరద సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు.

 
ఉప రాష్ట్రపతి  తెలియజేసిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రధాని, కేంద్ర హోం మంత్రి తమ వైపు నుంచి ఇప్పటికే సహకారాన్ని అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ అవసరమైన సహకారాన్ని అందజేస్తామని ఉపరాష్ట్రపతికి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments