Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు సాయం అడుగుతున్నాయ్: వెంకయ్య

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (13:20 IST)
నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొత్త కథ చెప్తున్నారు. పార్లమెంట్‌లో విభజన సందర్భంగా ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చిన వెంకయ్య నాయుడు.. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు ఇంకా సాయం కావాలని అడుగుతున్నాయని చెప్పుకొచ్చారు. 
 
అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 18 నెలలే అయ్యిందని, విభజన చట్టంలోని హామీలన్నింటికీ తమ సర్కారు తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఏపీకి హోదా ఇవ్వడంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. హోదా అంశాన్ని నీతి అయోగ్ పరిశీలిస్తోందని పునరుద్ఘాటించారు. 
 
పనిలో పనిగా వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ హోదాపై చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు. పునర్విభజన చట్టం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? అని వెంకయ్య సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంలో హోదా అంశాన్ని ఆనాడు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌కు ప్రశ్నించే హక్కుంది కానీ, విమర్శించే అర్హత లేదని వెంకయ్య స్పష్టం చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments