Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పనితీరు ప్రధానిని ఆకట్టుకుంది: వెంకయ్య నాయుడు

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (19:59 IST)
హుదూద్ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన విశాఖ వాసులకు త్వరితగతిన సహాయక చర్యలు అందించే క్రమంలో చంద్రబాబు రేయింబవళ్లు పనిచేసిన వైనం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆకట్టుకుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చంద్రబాబు నిజమైన ప్రజా సేవకుడని ప్రధాని మోడీ కీర్తించారని వెంకయ్య తెలిపారు. 
 
విశాఖ ఆర్కే బీచ్‌లో జరుగుతున్న ఆత్మవిశ్వాస ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజల గుండె నిబ్బరాన్ని పొగిడారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రతి ప్రాంతానికి పునర్వైభవం తీసుకొచ్చేదాకా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
 
విశాఖ వాసులు, హుదూద్ తుఫానుకు ఎదురొడ్డి నిలిచిన వైనం అమోఘమని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల కృషి ఫలితంగా విశాఖకు పూర్వ వైభవం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments