Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి పాలకమండలిలోకి ఉపరాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్...

దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలకమండలిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, సామాజిక సేవకురాలు దీప వెంకట్‌కు స్థానం లభించనుందని సమాచారం. అదేవిధంగా పీలేరుకు చెంద

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:09 IST)
దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలకమండలిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, సామాజిక సేవకురాలు దీప వెంకట్‌కు స్థానం లభించనుందని సమాచారం. అదేవిధంగా పీలేరుకు చెందిన చల్లాబాబుకు చోటు లభించనుంది. 
 
తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి సిఫార్సుతో చల్లా బాబుకు బోర్డులో స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పాతబోర్డులోని సినీ నిర్మాత, దర్శకుడు రాఘవేంద్రరావుకు మరోసారి పాలకమండలిలో అవకాశం దక్కనుంది. 
 
అయితే గత రెండు నెలల వరకు కూడా వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ పేరు వినబడకపోయినా తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా అనుకుని మరీ ఆమెకు ఈ పదవి ఇవ్వనున్నారట. ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి చంద్రబాబు కూడా తీసుకెళ్ళారట. టిటిడి బోర్డు సభ్యురాలిగా ఉండటం దీపా వెంకట్‌కు కూడా ఇష్టమేనంటున్నారు. శ్రీవారి చెంత ఉండటం ఎంతో మంచిదన్న ఆలోచన ఆమెది. అందుకే చంద్రబాబు చెప్పగానే దీప ఒకే అనేశారట. అయితే టిటిడి ఛైర్మన్ ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments