Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖతార్‌లో ఒంటెల కాపరిగా వీరేంద్ర.. నేనున్నానంటూ లోకేష్ భరోసా! (video)

సెల్వి
శనివారం, 20 జులై 2024 (12:07 IST)
Veerendra
దుబాయ్ ఖతార్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ మోసగించి తనను సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పడేశారని వీరేంద్ర కుమార్ తెలుగు యువకుడు సోషల్ మీడియా ద్వారా వారం క్రితం వాపోయాడు. తనను కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. తాను పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేశాడు. 
 
తనకు ముక్కులోనుంచి రక్తం కారుతోందని చెప్పాడు. ఒంటెల మధ్య గుడారాల్లో బతకలేకపోతున్నానని, తాగాడానికి నీరు, తినడానికి తిండి లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనను ఎలాగైన ఆ నరకం నుంచి కాపాడి ఇంటికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. 
 
తాను ఓ ఏజెంట్‌ని నమ్మి అతనికి రూ.1,70,0000 ఇస్తే.. తన జీవితం అల్లకల్లోలం చేశాడని కన్నీరు పెడుతున్నాడు. తనను ఆ నరకం నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. 
 
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని అతని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments