Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు వాసిరెడ్డి పద్మ షాక్.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (11:53 IST)
వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అలాగే, ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. నిజానికి ఏపీలో వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత వాసిరెడ్డి పద్మ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం వైకాపాకు రాజీనామా చేశారు.
 
కాగా, 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ రాజ్యసభ సభ్వత్వాలకు రాజీనామా చేశారు. అలాగే, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments