Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్నని చంపిన టీడీపీలో ఎలా చేరుతా? : వంగవీటి రాధ

విజయవాడలో వైకాపాకు పట్టుకొమ్మలా ఉన్న సీనియర్ నేత వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారంటూ ఓ ప్రచారం సాగింది. ముఖ్యంగా, ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ అధికార టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (16:14 IST)
విజయవాడలో వైకాపాకు పట్టుకొమ్మలా ఉన్న సీనియర్ నేత వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారంటూ ఓ ప్రచారం సాగింది. ముఖ్యంగా, ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ అధికార టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగింది. 
 
దీనిపై వంగవీటి రాధ స్పందించారు. "మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను. నాకు టీడీపీలో జాయిన్ అవ్వాల్సిన అంతా కర్మ పట్టలేదు. ఇంకోక్కసారి ఇలాంటి చెత్త వార్తలు రాస్తే పరువు నష్టదావా వేస్తా. జగన్‌ మోహన్‌ రెడ్డి నా సోదరుడు. నా ప్రాణం ఉన్నంతా వరకు వైసీపీలోనే ఉంటా. బెజవాడ 2019లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచి కృష్ణా జిల్లాలో మిగిలిన సీట్లను సైతం గెలిపించేందుకు నా సర్వశక్తులు వాడ్డుతా అంటూ ప్రకటించారు. 
 
అయితే, ఓ వర్గం నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వంగవీటి రాధ అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, రెండుసార్లు తన వద్దకు పిలిపించుకుని స్వయంగా బుజ్జగించినా, ఆయన వినలేదని, పార్టీ మారేందుకే మొగ్గు చూపారని తెలుస్తోంది. మల్లాది విష్ణును పార్టీలోకి తెచ్చినా, రాధ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని జగన్ హామీ ఇచ్చారని, అయితే, విష్ణుకు విజయవాడ సెంట్రల్ ఆఫర్ చేయడంతోనే వివాదం పెరిగిందని సమాచారం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments