Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (14:44 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం సమావేశమయ్యారు. దాదాపు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిన బుధవారం విడుదలైన వల్లభనేని వంశీ.. జైలు నుంచి విడుదలైన మరుసటిరోజే జగన్‌ను కలుసుకున్నారు. 
 
తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వచ్చిన వంశీ... తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురైనట్టు సమాచారం.
 
కాగా, కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైకాపా నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే, వంశీపై ఏకంగా 11 కేసులు నమోదు చేసి జైలుపాలు చేశారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, వంశీకి గుడివాడ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 140 రోజుల తర్వాత విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన విడుదలకు మార్గం ఏర్పాటైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments