Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

సెల్వి
గురువారం, 3 జులై 2025 (14:25 IST)
Vallabhaneni Vamsi
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను తాడేపల్లి నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. బుధవారం జైలు నుంచి బెయిల్‌పై వంశీ విడుదలయ్యారు. ఆయనపై కిడ్నాప్‌, బెదిరింపులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ ఇళ్ల పట్టాలు, అక్రమ గనుల తవ్వకాలు వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. 
 
ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్‌ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆపై నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్‌ జగన్‌కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
 
ఇక అంతకుముందు వంశీ నివాసానికి వైసీపీ పార్టీ నేత‌లు వెళ్లారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో వల్లభనేని వంశీని పరామర్శించారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్. కాగా 137 రోజులు జైల్‌లో ఉన్న వంశీ బుధవారం జైలు నుండి విడుదలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments