Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టీచర్లకు వ్యాక్సిన్‌!

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (09:28 IST)
ఏపీలో ఉపాధ్యాయులు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. తొలిదశలో 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తోంది. మండలాల వారీ వ్యాక్సిన్‌ కేంద్రాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయులు వ్యాక్సిన్‌ తీసుకునేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు.

గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలను కేంద్రాల వద్దకు తీసుకెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల విద్యాశాఖ అధికారులు కూడా మరో రెండు రోజుల్లో వ్యాక్సిన్‌కు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది.

పాఠశాలల్లో 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారనే జాబితాను ప్రధానోపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితా వైద్యారోగ్య శాఖకు వెళ్తుంది. ఈ జాబితా ప్రకారం టీచర్లకు వ్యాక్సిన్‌ అందనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments