Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో అంటరానితనానికి అంతిమయాత్ర

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (17:40 IST)
నిజమే.. మీరు.. విన్నది నిజమేనండి. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్‌ కలలు కన్నది అందరు ఒకటేనని. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దళితులను అగ్రవర్ణాల ప్రజలు అంటరానివారిగానే చూస్తున్నారు. ఇలాంటి అంటరానితనానికి అంతిమయాత్ర అనే ఒక వినూత్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టారు ట్రాన్స్‌ఫామ్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధులు. 
 
చిత్తూరు జిల్లాలోని నగరి, నిండ్ర, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లోని నాలుగు గ్రామాలలో దళితులు నివాసముండే ప్రాంతంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. దళితులు ఉన్న ప్రాంతానికి దళితవాడ అనే పేరు తీసి వేసి గ్రామస్థులు నిర్ణయించుకున్న పేరును బోర్డుగా తయారుచేయించి గ్రామం మధ్యలో నిలబెట్టారు. అంతేకాదు ఆలయంలో దళితులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దళితులు తక్కువ కులం కాదని, ప్రపంచంలో అందరు సమానమేనని ట్రాన్స్‌ఫామ్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపకులు జయచంద్ర నాయుడు అంటున్నారు. 
 
అంతేకాదు శ్మశానాలు కూడా ఒకేచోట ఏర్పాటు చేస్తోందీసంస్థ. చనిపోయిన వారు ఏ కుల, మతాలకు చెందిన వారైనా ఒకే స్మశానంలో పూడ్చిపెడతామని చెపుతున్నారు. దేశంలో అగ్రవర్ణాలు ఇప్పటికీ దళితులను కించపరుస్తున్నాయని, ఇలాంటి వాటికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. మరోవైపు బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దళితులతో కలిసి ఆలయంలో పూజలు చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments