Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంవత్సరానికొకసారి తద్దినం పెట్టినట్టు స్వచ్ఛ భారత్ చేస్తే కుదరదు: వెంకయ్య నాయుడు

యేడాదికి ఒక సారి తద్దినం పెట్టినట్టు స్వచ్ఛ భారత్ చేస్తే కుదరదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (17:28 IST)
యేడాదికి ఒక సారి తద్దినం పెట్టినట్టు స్వచ్ఛ భారత్ చేస్తే కుదరదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘స్వచ్ఛ భారత్’ అనేది ప్రతిరోజూ చేయాల్సిన కార్యక్రమం అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 
 
అలాకాకుండా, సంవత్సరానికొకసారి తద్దినం పెట్టినట్లో, శ్రాద్ధం పెట్టినట్లో, లేకపోతే, వ్రతం చేసినట్లో ఈ కార్యక్రమం చేస్తామంటే కుదరదని అన్నారు. ‘మనం రోజూ గడ్డం గీసుకోవాలి కదా. మన గడ్డం మనమే గీసుకోవాలి కదా, లేకపోతే, వేరే వాళ్లకు డబ్బులిచ్చి గీసుకోవాలి. గవర్నమెంట్ వచ్చి మనకు గడ్డం గీయదు కదా! ఇంకా ఆ స్కీమ్ రాలేదు. భవిష్యత్‌లో పెడతారేమో తెలియదు. అక్టోబర్ 2న గడ్డం గీసుకున్నాను.. మళ్లీ వచ్చే అక్టోబర్ 2వరకు గడ్డం గీసుకోనని ఎవరైనా ఉండిపోతే, ఏమవుతుంది!.. సాధువు అయిపోతారు. అందుకని, పరిశుభ్రతనేది ప్రతిఒక్కరి జీవితంలో దినచర్య కావాలి’ అంటూ వెంకయ్యనాయుడు తనదైన శైలిలో మాట్లాడారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments