Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేపీతో మాట్లాడాక చెపుతా... : ఉండవల్లి అరుణ్ కుమార్

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం కానున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని భావ

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:51 IST)
లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం కానున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇప్పటికే జేపీతో పవన్ చర్చలు జరుపగా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం పవన్‌తో భేటీ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్‌తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించారు. పవన్‌తో భేటీ అనంతరం జయప్రకాశ్ మాట్లాడుతూ.... పవన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తర్వాతనే జేఏసీలో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments