Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారును చంద్రబాబు గద్దె దించాలి: ఉండవల్లి సలహా

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు తిరుగుబాటు చేశారని.. ఎన్డీఏలో వున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారున

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:11 IST)
కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు తిరుగుబాటు చేశారని.. ఎన్డీఏలో వున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారును గద్దె దించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ సలహా ఇచ్చారు.

ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా, మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్ను సిన్హా నేతృత్వంలో సమావేశం నిర్వహించారని ఉండవల్లి గుర్తు చేసారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు వారితో కలిసి ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం చంద్రబాబు చేతుల్లో వుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. 
 
చంద్రబాబు మోదీకి బుద్ధి చెప్పాలంటే.. ఇదే సరైన తరుణమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసులకు, జైళ్లకు భయపడటం మానేసి.. ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.

దేశంలో జ్యుడీషియరీని ఎదుర్కోవడంలో బాబు తర్వాతే ఎవరైనా అంటూ ఉండవల్లి విమర్శించారు. కాబట్టి కేసీఆర్ తరహాలో ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి సూచించారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments