Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా?

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (09:10 IST)
ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన వారిలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ ఒకరు. దివగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మినబంటుల్లో ఒకరు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. రాజమండ్రి పర్యటన సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఉండవల్లి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతుంది. దీనిపై ఉండవల్లి తాజాగా క్లారిటీ ఇచ్చారు. 
 
తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. పైగా, వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల రాజమండ్రికి వస్తే తన ఇంటికి రాకుండా పోతుందా అని ఆయన ప్రశ్నించారు. తాను ఇకపై క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2019 కంటే 2024లో పరిస్థితి కాస్త మెరుగుపడిందన్నారు. 
 
అలాగే, వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల అంశంపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. అది వారి కుటుంబ విషయాలని అన్నారు. తాను ప్రజా సమస్యలపై మాత్రమే స్పందిస్తానని చెప్పారు. కుటుంబ విషయాలు వాళ్లే చూసుకుంటారని చెప్పారు. కుటంబ తగాదాలను కూడా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా, అవన్నీ వారు చూసుకుంటారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments