Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట.. విజయవాడలో మహిళపై దారుణం

విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ప్రవేశించి పద్మావతి అనే మహిళను హత్య చేసేందుకు ఇద్దరు ఆగంతుకులు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు పద్మావతి (48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (20:34 IST)
విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ప్రవేశించి పద్మావతి అనే మహిళను హత్య చేసేందుకు ఇద్దరు ఆగంతుకులు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు పద్మావతి (48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై ఎదురు తిరిగింది. 
 
పెద్దగా అరుస్తూ కేకలు పెట్టింది. దీంతో ఆ ఆగంతుకులు మహిళ మెడ కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యారు. పద్మావతి అరుపులు విన్న చుట్టుప్రక్కల వారు వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో పడి వుంది. దీనితో హుటాహుటిన ఆమెను ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
పద్మావతి ఇంట్లో హత్యాప్రయత్నం తర్వాత దుండగులు మరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. అక్కడ పని చేసే వాచ్‌మెన్‌ మీరు ఎవరని నిలదీయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments