Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వరద నీటిలో చిక్కున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు, ఉప నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో రెండు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో ఈ రెండు బస్సులు వరద నీటిలో చిక్కుకునిపోయాయి. 
 
ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో వాగులో చిక్కుకుని పోయాయి. ఈ రెండు బస్సుల్లో కలిపి సుమారుగా 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు టాపెక్కి కూర్చొన్నారు. వీరిని రక్షించేందుకు వరద విపత్తుల సహాయక సిబ్బంది ప్రయత్నిస్తుంది. 
 
మరోవైపు, ఈ భారీ వర్షం కారణంగా వచ్చిన వరద నీటి ప్రవాహానికి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకునిపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి, అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments