Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వరద నీటిలో చిక్కున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు, ఉప నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో రెండు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో ఈ రెండు బస్సులు వరద నీటిలో చిక్కుకునిపోయాయి. 
 
ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో వాగులో చిక్కుకుని పోయాయి. ఈ రెండు బస్సుల్లో కలిపి సుమారుగా 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు టాపెక్కి కూర్చొన్నారు. వీరిని రక్షించేందుకు వరద విపత్తుల సహాయక సిబ్బంది ప్రయత్నిస్తుంది. 
 
మరోవైపు, ఈ భారీ వర్షం కారణంగా వచ్చిన వరద నీటి ప్రవాహానికి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకునిపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి, అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments