Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తినాలనే ఆశతో దేవుడు హుండీకే కన్నంవేసిన చిన్నారులు!! (video)

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:50 IST)
ఆ ఇద్దరు చిన్నారులకు బిర్యానీ ఆరగించాలని ఆశ కలిగింది. కానీ, చేతిలే పైసా లేదు. మరి బిర్యానీ తినాలన్న ఆశ ఎలా నెరవేర్చుకోవాలి. అపుడే వారికి ఓ ఐడియా వచ్చింది. సమీపంలోని గుడిలో ఉన్న దేవుడి హుండీపై వారి కన్నుపడింది. అంతే.. ఆ హుండీని పగులగొట్టి.. అందులోని డబ్బులు తీసుకెళ్లి పుష్టిగా బిర్యానీ ఆరగించారు. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో ఈ నెల 26వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు పలుగుతో గుడి తాళం పగులగొట్టి, అదే పలుగుతో హుండీని ధ్వంసం చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ దొంగతనానికి పాల్పడింది అదే మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇద్దరు బాలురుగా గుర్తించారు. వారిని విచారించగా బిర్యానీ తినాలనే కోరికతోనే హుండీ పగుల గొట్టి అందులో నుంచి రూ.140 తీసుకున్నామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments