Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక అమ్మాయి.. ముగ్గురబ్బాయిలు.. శ్రావణి కథ ఇదే

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:35 IST)
టీవీ సీరియల్‌ నటి శ్రావణి 2012లో హైదరాబాద్‌కు వచ్చి ఆర్టిస్ట్‌గా పని చేసింది. 2015లో ఆమెకు సాయికృష్ణారెడ్డితో, అతడి ద్వారా 2017లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ నిర్మాత అశోక్‌రెడ్డితో పరిచయమైంది.

2019లో దేవరాజు టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యాడు. అతణ్ని పెళ్లి చేసుకుందామని శ్రావణి భావించింది. ఆమె దేవరాజుకు దగ్గరవడాన్ని గమనించిన సాయి.. ఆ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడు.

దీంతో గొడవలు మొదలయ్యాయి. శ్రావణి తల్లిదండ్రులు కూడా ఆమెను ఇబ్బంది పెట్టారు. సాయితో కలిసి ఆమెను కొట్టారు. మరోవైపు.. దేవరాజు కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రావణిని మోసం చేశాడు.
 
సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ శ్రావణికి ఆశ చూపిన అశోక్‌రెడ్డి ఆమెతో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారని తెలిసింది.

గత ఎనిమిది నెలలుగా ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడని.. సాయికృష్ణ ద్వారా ఆమెపై ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఈ నెల 7న అమీర్‌పేటలోని ఓ హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌ల మధ్య జరిగిన గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.

అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డితో పాటు మిగతా అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన పరిణామాల్లో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. అశోక్‌ రెడ్డిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments