Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుడా ఖ్యాతిని పెంపొందించాలి : ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (20:08 IST)
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ఖ్యాతిని పెంపొందించే దిశగా సిబ్బంది పనిచేయాలని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చెవిరెడ్డి తుమ్మలగుంటలోని నివాసం వద్ద తుడా సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అటువంటి గుర్తింపు కలిగిన ప్రదేశంలో పనిచేస్తుండటం అదృష్టంగా భావించాలని అన్నారు. కుటుంబ సభ్యుల్లా అందరం కలిసికట్టుగా పనిచేసి తుడాకు గొప్ప పేరును తీసుకొద్దామని సూచించారు. 
 
అంతకుముందు తుడా కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రెడ్డి, ఇఇ వరదా రెడ్డి, డీఈ కృష్ణా రెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments