Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాలు రద్దు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:19 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మొత్తం తొమ్మిది రోజులపాటు స్వామివారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 18వ తేదీన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను తొమ్మిది రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటుచేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబరు 18వ తేదీన స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 
 
గరుడ సేవ రోజును రద్దీని దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. భక్తులకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు రుయా ఆస్పత్రి సిబ్బందిని రపిస్తామని తెలిపారు. ఘాట్‌ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, క్రూర మృగాల సంచారం నేపథ్యంలో నడకదారులు, ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటవీ శాఖ ఇచ్చే నివేదిక మేరకు నడక మార్గంలో నిబంధనలను సడలిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments