Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవో ధర్మారెడ్డికి ఊరట.. జైలుశిక్షపై తాత్కాలిక స్టే

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (15:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన నెల రోజుల జైలు శిక్షనపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 
 
తితిదే ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో తితిదే ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల అపరాధం విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. దీనిపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. 
 
కాగా, గతంలో ముగ్గురు తితిదే ఉద్యోగులు తమను క్రమబద్దీకరించేలా తితిదే ఈవోను ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించి సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారిని క్రమబద్దీకరించాలని తితిదే ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. కానీ తితిదే ఈవో అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద ఈవోకు నెల రోజుల జైలుశిక్ష విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments