Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్ రద్దీలో గో'దారులు'... కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలు..

Webdunia
శనివారం, 18 జులై 2015 (12:30 IST)
వరుసగా సెలవులు రావడంతో గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో గోదావరి వైపుగా వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలలో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీకారణంగా వాహనాలు నత్తనడక నడుస్తున్నాయి. 
 
విశాఖ జిల్లా నక్కపల్లి, కాగిత టోల్ గేట్ ప్రాంతాల్లో దాదాపు రెండు కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు ఇతర వాహనాలు బారులుతీరాయి. నక్కపల్లి అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు విజయవాడ- రాజమండ్రి జాతీయ రహదారిపై కూడా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గన్నవరం, హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. 
 
అటు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వద్ద సుమారు ఆరు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు-నల్లజర్ల, కోవ్వూరు-నిడదవోలు మార్గాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మరో వైపు బస్సులూ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లు పుష్కరయాత్రికులతో నిండిపోయాయి. గంటలకొద్దీ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments