Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (17:18 IST)
సూర్య గ్రహణం కారణంగా ఆదివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి 21వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తెరువనున్నట్లు ఈవో చెప్పారు.

సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలు కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. సూర్య గ్రహణం రోజు పరోక్ష సేవలను కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనానికి దేవస్థానం చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం పరిశీలించారు. క్యూలైన్ల ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకొని దర్శనానికి వచ్చారు.

భక్తులు భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు ఏర్పాట్లు, అవగాహన కోసం ఫ్లెక్సీబోర్డుల ఏర్పాటు వంటి అంశాలను ఈవో రామారావు వారికి వివరించారు. అంతకుముందు కలెక్టర్‌, ఎస్పీ నక్షత్రవనంలో మొక్కలు నాటారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments