Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు హస్తినకు వెళ్లనున్న సీఎం జగన్ .. రెండు రోజులు మకాం అక్కడే..

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (09:06 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన గన్నవరం నుంచి హస్తినకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ రెండు రోజులు పాటు ఉంటారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరి సమయాన్ని బట్టి గురువారం లేదా శుక్రవారం ఢిల్లీ నుంచి తిరిగిరానున్నారు.
 
జగనన్న ఇళ్ళ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో గురువారం సీఎం జగన్ పాల్గొనాల్సివుంది. ఇది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం. కానీ దీన్ని హఠాత్తుగా వాయిదా వేసారు. ఆ రోజునే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యంలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ తొలిసారిఢిల్లీకి వెళుతుండటంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. నిజానికి జగన్ దంపతులు లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేక పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments