చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (09:12 IST)
గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసును కొట్టి వేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేట్టనుంది. సర్వోన్నత న్యాయస్థానంలోని ఆరో నంబరు కోర్టులో ఐటం నంబర్ 63గా ఈ కేసు లిస్ట్ చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.272కోట్ల అవినీతి జరిగిందంటూ వైకాపా ప్రభుత్వం కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసి  రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా బంధించింది. అయితే, తనపై అక్రమంగా కేసు పెట్టారనీ, దీన్ని కొట్టి వేయాలంటూ కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అలాగే, క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టే సమయంలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ ఏపీ సీఐడీ పోలీసులు కేవియట్ రిట్‌ను దాఖలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments