Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (13:23 IST)
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థిని గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని అనిత తన రూమ్‌మేట్స్ బయటకు వెళ్లిన సమయంలో కాలేజీ హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆమె రూమ్‌మేట్స్, ఆమె ఉరివేసుకుని ఉండటం చూసి షాక్ అయ్యారు. దీంతో వారు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
అనితది అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని గుర్రంకొండ గ్రామానికి చెందినదని పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments