Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగనన్న బాదుడుతో శ్రీవారి భక్తులపై మరింత భారం

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (15:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను భారీగా పెంచేసింది. ప్రయాణ చార్జీల పేరిట కాకుండా డీజిల్ సెస్ పేరుతో చార్జీలను బాదేశారు. ఈ భారం కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.80 చొప్పున ఉంది. ఈ పెంపుతో శ్రీవారి భక్తులపై ప్రయాణ భారం పడింది. 
 
తిరుమల - తిరుపతి ఘాట్‌ రోడ్డు ప్రయాణానికి ఒక్కో టిక్కెట్‌పై అదనంగా రూ.15 పెరిగింది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.75గా ఉంటే ఇపుడు ఇది రూ.90కి చేరింది. డీజిల్ సెస్ పేరుతో పెంచిన చార్జీలు జూలై ఒకటో తేదీ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులో మినహా మిగిలిన బస్సులో ఈ ప్రయాణ చార్జీలు విపరీతంగా పెంచేశారు.
 
తిరుపతి - తిరుమల ప్రాంతాల మధ్య పిల్లల టిక్కెట్ రూ.45గా ఉంటే ఇపుడు అది రూ.50కి చేరింది. రానుపోను టిక్కెట్ ధరలో రూ.130గా ఉంటే ఇపుడది రూ.160కి పెంచేశారు. 2018లో తిరుమల తిరుపతి ప్రాంతాల మధ్య టిక్కెట్ ధర రూ.50గా ఉంటే గత నాలుగేళ్ల కాలంలో రూ.40కి పైగా పెరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments