Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (19:46 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీని ఎంపిక చేసినట్లు పార్టీ నేతలకు ఆయన తెలిపారు. తిరుపతి లోక్‌సభ నియోజక వర్గంలో పార్టీ నేతలతో ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మీ మళ్లీ బరిలోకి దిగుతున్నట్లు నేతలతో చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. పనబాక లక్ష్మీ గెలుపుకోసం అందరూ అహర్నిశలు పాటుపడాలని పార్టీ నేతలకు తెలిపారు.
 
వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగబోతుంది. ఇతర పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ ప్రటించబడ్డారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments