Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడంలో తిరుపతి టాప్

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (11:47 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తిరుపతి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోని స్మార్ట్‌సిటీలైన విశాఖపట్టణం, అమరావతి, కాకినాడతో పోలిస్తే తిరుపతి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మొదటి స్థానంలో నిలిచింది. 
 
వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ భేషుగ్గా ఉన్నాయని స్మార్ట్‌మిషన్ తన నివేదికలో పేర్కొంది.వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో స్మార్ట్‌నగరాల పనితీరును స్మార్ట్‌సిటీ మిషన్ మూడు గ్రేడ్‌లుగా విభజించి పరిశీలించింది.
 
విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్ల వద్ద పక్కాగా మార్కింగ్ చేయడం, వారిని క్వారంటైన్ చేయడంలో తిరుపతి అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందిస్తున్నారని స్మార్ట్‌మిషన్ తెలిపింది.
 
అలాగే లాక్ డౌన్ కొనసాగినంత కాలం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనాలకు భక్తులను అనుమతించే అవకాశం లేదని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఏప్రిల్ 14 వరకూ దర్శనాలను నిలిపివేశామని, ఆ తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. స్వామివారి సేవలన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయని, శ్రీరామనవమి, పట్టాభిషేకం కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments