Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:51 IST)
తిరుమల బూందీ తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. లడ్డూ తయారీ కోసం తయారు చేసే 19వ బూందీ పోటులో అ ప్రమాదం జరిగింది. ఇందులో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. బూందీ పోటులో గోడలకు నెయ్యి అంటుకుని ఉండడంతో మంటలు మరింత పెరిగాయి. 
 
కొద్దిసమయంలోనే మంటలు వ్యాపించడంతో బూందీ పోటులో ఉన్న కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు కూడా పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవ్వాక్కయ్యాడు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలోనూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని అధికారుల దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments