తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. పోలీసులు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లు అంతా కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనీ, ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
తిరుపతిలో స్థానికేతురులు దొంగ ఓట్లు వేసేందుకు వస్తుంటే వారిని తెదేపా శ్రేణులు అడ్డుకుంటే, అడ్డుకున్నవారిని పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధి దాటి వేల మంది బయట నుంచి వచ్చారని అన్నారు.