Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తురాలిపై ఎలుగుబంటి దాడి...

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (10:29 IST)
తిరుమలలో భక్తురాలిపై ఎలుగుబంటి దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళా భక్తురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమలగిరుల్లో వన్యప్రాణాలు అధికంగా సంచరిస్తున్న విషయం తెల్సిందే. ఇవి కొన్ని సందర్భాల్లో రక్షణ కంచెను దాటి కాలినడక శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులపై దాడి చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా తిరుమలకు వచ్చిన ఓ యువతి, గోగర్భం డ్యామ్‌లో స్నానం చేసి వస్తుండగా, ఎలుగుబంటి దాడి చేసింది. ఆ భక్తురాలిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విజయలక్ష్మి (26)గా గుర్తించారు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆమె తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. హైదరాబాద్‌లో తన అవసరాలకు తగినంత డబ్బులను తల్లి ఇవ్వడం లేదని అలిగిన విజయలక్ష్మి గత శుక్రవారం తిరుమలకు చేరుకుని, అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. 
 
ఈ క్రమంలో సోమవారం గోగర్భం డ్యామ్ వద్దకు వెళ్లిన ఆమె, స్నానానంతరం అడవి వైపు వెళ్లగా, అక్కడే కాచుకుకూర్చున్న ఎలుగు దాడి చేసింది. ఈ ఘటనలో గాయాలపాలైన ఆమె, కేకలు వేస్తూ పరుగులు పెట్టగా, గమనించిన ఇతర భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమెను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించిన అధికారులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments