Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, అందరికీ సర్వదర్సనం టోకెన్లు, ఎప్పట్నుంచి అంటే?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:01 IST)
సర్వదర్సనం టోకెన్లను కేవలం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టిటిడి అందిస్తోంది. గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు టోకెన్ల కోసం కౌంటర్ల వద్దకు చేరుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం అతిథి గృహంలో టోకెన్లను అందిస్తోంది టిటిడి.
 
అయితే చిత్తూరు జిల్లా వాసులకే కాకుండా భక్తులందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు టోకెన్లు ఇచ్చే శ్రీనివాసం వసతి సముదాయాల వద్దకు చేరుకుని ఆందోళనకు కూడా దిగారు. దీంతో టిటిడి ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు.
 
ఈ నేపథ్యంలో టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మరో వారంరోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా సర్వదర్సనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ చెప్పారు. సుపథం దర్సనానికి ఎన్ని టిక్కెట్లు మంజూరు చేస్తున్నారో అంతకు రెట్టింపుగా సర్వదర్సనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు.
 
టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకెన్లు అయిపోయాయని.. భక్తుల ఆందోళనకు దిగడం.. లాఠీఛార్జీ వంటి పరిణామాలు జరగడం బాధాకరమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments