Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పాప ఖరీదు రూ.10 లక్షలా? మీ ఆర్థిక సాయం మాకు అక్కర్లేదు : బేబీ లక్షిత తాత

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (10:00 IST)
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులి దాడి కేసులో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తమ కుమారుడికి వెంట్రుకలు తీసుకునేందుకు తిరుమలకు నడిచి వెళుతుండగా, చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, మృతురాలి కుటుంబానికి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు రూ.10 లక్షల ఆర్థికసాయం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వీటిపై లక్షిత తాత శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. అసలే బిడ్డను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. మా పాప ప్రాణంఖరీదు రూ.10 లక్షలుగా నిర్ణయించారని, అయినా మాకు ఎవరి సాయం అక్కర్లేదని ఆయన తెల్చి చెప్పారు.
 
తిరుమల కొండలపై జింకలకు ఇచ్చే రక్షణ భక్తులకు లేదన్నారు. జింకలను స్వేచ్ఛగా వదిలితేనే చిరుతలు, పులులు మనుషుల వైపు రావని ఆయన అనారు. జింకలను ఎందుకు బంధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిలు సంచారం ఉన్నట్టు పత్రికల్లో నిరంతరం వార్తలు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. కంచ వేసివుంటే బిడ్డ ప్రాణాలతో ఉండేదని బోరున విలపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ఆయన కోరారు. నాయకులు వస్తే భద్రత కల్పిస్తారని, మాలాంటి సాధారణ భక్తులు మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments