Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైమ్‌కి రాకపోతే అంతే.. కుర్చీలు ఖాళీగా ఉంటే..?

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:11 IST)
అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. గురువారం ఉదయం ఆకస్మికంగా సచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. వచ్చీరాగానే తన పంచాయతీరాజ్ విభాగానికి వెళ్లి చూశారు. దాదాపు అన్ని సెక్షన్లలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపించాయి. 
 
21 మంది అధికారుల్లో కేవలం నలుగురే విధులకు హాజరయ్యారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ విభాగపు కమిషనర్ కూడా ఆలస్యంగానే వచ్చారని తప్పుపట్టారు. అంతలో మంత్రి వచ్చిన సమాచారం తెలియడంతో ఉద్యోగులు హడావుడిగా కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు.
 
తొలి తనిఖీ కావడంతో ఉదారంగా వ్యవహరిస్తున్నామని.. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవటం సరికాదని కేటీఆర్ చెప్పారు.
 
‘పరిపాలనకు సచివాలయం గుండెకాయ లాంటిది. ఇక్కడే సమయపాలన పాటించకపోతే   క్షేత్రస్థాయి వరకు అటువంటి సంకేతాలే వెళ్తాయి. కొత్త రాష్ట్రంపై ప్రజలకు కోటి ఆశలున్నాయి’ అని అన్నారు. సెక్షన్ క్లర్కు నుంచి కమిషనర్.. ముఖ్య కార్యదర్శి వరకు ఎవరైనా సరే సమయపాలన పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
భవిష్యత్తులోనూ ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని.. టైమ్‌కు రాని ఉద్యోగులపై చర్యలుంటాయని.. గైర్హాజరు అయినట్లు పరిగణిస్తామని హెచ్చరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments