Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతకనివ్వట్లేదు.. అందుకే చనిపోతున్నాం.. టిక్ టాక్ ప్రేమ జంట

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (12:04 IST)
టిక్ టాక్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ.. మంగళగిరికి చెందిన పవన్ కుమార్‌లకు.. టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో... ఆగస్టు మూడో తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
 
ఇల్లు అద్దెకు తీసుకుని కొత్తకాపురం ప్రారంభించారు. ఇదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు. పవన్‌ను వదిలేసి ఇంటికి రావాలని శైలజపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి నుండి శైలజ సెల్ ఫోన్ కూడ వాడటం మానేసింది. ఆ తరువాత పవన్ కుమార్‌కు.. శైలజ బందువులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు.
 
కలసి బతకలేని స్థితి ఏర్పడిందని భావించిన శైలజ దంపతులు... చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు శైలజ... సూసైడ్ లెటర్ రాసింది.
 
తల్లి హేమలత, తండ్రి రవీంద్రతో పాటుగా బంధువు సుబ్రహ్మణ్యం పేరును శైలజ ప్రస్తావించింది. తమ చావుకు ఈ ముగ్గురే కారణమని లిఖిత పూర్వకంగా తెలిపింది. కేసు నమోదు చేసిన బెల్లంకొండ పోలీసులు.... మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments