Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతకనివ్వట్లేదు.. అందుకే చనిపోతున్నాం.. టిక్ టాక్ ప్రేమ జంట

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (12:04 IST)
టిక్ టాక్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ.. మంగళగిరికి చెందిన పవన్ కుమార్‌లకు.. టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో... ఆగస్టు మూడో తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
 
ఇల్లు అద్దెకు తీసుకుని కొత్తకాపురం ప్రారంభించారు. ఇదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు. పవన్‌ను వదిలేసి ఇంటికి రావాలని శైలజపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి నుండి శైలజ సెల్ ఫోన్ కూడ వాడటం మానేసింది. ఆ తరువాత పవన్ కుమార్‌కు.. శైలజ బందువులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు.
 
కలసి బతకలేని స్థితి ఏర్పడిందని భావించిన శైలజ దంపతులు... చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు శైలజ... సూసైడ్ లెటర్ రాసింది.
 
తల్లి హేమలత, తండ్రి రవీంద్రతో పాటుగా బంధువు సుబ్రహ్మణ్యం పేరును శైలజ ప్రస్తావించింది. తమ చావుకు ఈ ముగ్గురే కారణమని లిఖిత పూర్వకంగా తెలిపింది. కేసు నమోదు చేసిన బెల్లంకొండ పోలీసులు.... మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments