Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగు ప‌డుతుంద‌ట‌... త‌స్మాత్ జాగ్ర‌త్త‌! ఎక్క‌డ‌?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:19 IST)
అస‌లే ఈ మ‌ధ్య వాతావ‌ర‌ణం బాగోలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద‌యం మండుటెండ‌... భ‌రించ‌లేని ఉక్క‌పోత‌... సాయంత్రం ఉరుములు మెరుపుల‌తో వ‌ర్షం. అంతా తేడాగా ఉంద‌ని అంద‌రూ భావిస్తున్న వేళ‌... విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు.

తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక ఉంద‌ని... అక్క‌డి ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని ముంద‌స్తుగా స‌మ‌చారం అందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం ప్రాంతాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంది.

అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా న‌ల్లజేర్ల, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం,పేరవల్లి, ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర, ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చ‌రించారు. ఎవ‌రూ చెట్ల కింద‌, బహిరంగ ప్రదేశాల్లో ఉండవ‌ద్ద‌ని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments