ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (09:30 IST)
ప్రకాశం జిల్లా దర్శిలో విషాదం చోటుచేసుుకంది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికంగా ఉండే సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన ఈ ముగ్గురు విద్యార్థులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. దర్శి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేశ్ (19), కందురి చందుకిరణ్ (18), బత్తుల మణికంఠ రెడ్డి (18)లు అనే ముగ్గురు స్నేహితులు సాగర్ కాలులో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. 
 
గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానిక ప్రజలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా పోతిరెడ్డి లోకేశ్ మృతదేహం మాత్రం లభ్యమైంది. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. చేతికొచ్చిన బిడ్డలు దూరం కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments