Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు బ్రాంచ్ కెనాల్లో ముగ్గురు యువ‌కుల గ‌ల్లంతు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:49 IST)
పుట్టెంటుకులు తీసే కార్య‌క్ర‌మానికి వెళుతూ, తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు ముగ్గురు యువ‌కులు. శుభ‌కార్యానికి వెళుతూ, మ‌ధ్య‌లో ఈత కొట్టాల‌ని వారు ప‌డిన ఆరాటం, చివ‌రికి మృత్యువాత‌కు దారితీసింది.

గుంటూరులోని బ్రాంచ్ కెనాల్‌ (జీబీసీ)లో కండ్లగుంట గ్రామం వద్ద ఈతకు దిగిన ముగ్గురు యువకులు గల్లంత‌య్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. గుంటూరుకు చెందిన కొందరు నకరికల్లు మండలం చల్లగుండ్లలో పుట్టువెంట్రుకల కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో ఆరుగురు ఆటోలో, ఇద్దరు బైక్‌పై కండ్లగుంట మీదుగా నరసరావుపేట వెళ్లేందుకు బయలుదేరారు. కండ్లగుంట వద్దకు రాగానే వీరిలో ముగ్గురు స్నానానికి దిగారు. స్నానానికి దిగిన వారిలో వుల్లంగుల కోటేశ్వరరావు, పగడాల అశోక్‌ (34), ఆటో డ్రైవర్‌ సామి సురేష్‌బాబు (36)లు ఉన్నారు. వీరు ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోగా, ఆటో డ్రైవర్‌ సురేష్‌బాబు మృతదేహాన్ని బయటకుతీశారు. అశోక్‌, కోటేశ్వరరావుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నకరికల్లు ఎస్‌ఐ పి. ఉదయబాబు తన సిబ్బందితో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments