Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితిమీరిన వేగం.. ముద్దలా మారిపోయిన కారు... వైద్య విద్యార్థులు మృతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (09:51 IST)
చిత్తూరు జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరి వేగంతో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి కారు ముద్దలా మారిపోయింది. దీంతో అందులోని ఇద్దరు వైద్య విద్యార్థులు, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలో శెట్టిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకుని తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. అయితే, మద్యం మత్తులో అమిత వేగంతో కారును నడుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న లారీని ఢీకొన్నారు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో లారీకి కార్డు అడ్డంగా పడటంతో షిప్టు కారు ముద్దలా మారిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
మృతులు కుప్పంలోని ఈపీఎస్ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదుపుతున్నారు. మృతులను వికాస్, కళ్యాణ్‌, ప్రవీణ్‌గా గుర్తించారు. వీరిలో వికాస్, కళ్యాణ్‌లో ఫైనల్ ఇయిర్ ఎంబీబీఎస్ విద్యార్థులు. మరో మృతుడు కళ్యాణ్ సోదరుడు ప్రవీణ్. ఈ ప్రమాదానికి అమిత వేగమే కారణంగా తెలుస్తోంది. 
 
ఈ కారు పీఈఎస్ నుంచి కారులో కుప్పం వైపు వెళుతుండగా, జరిగింది. వీరంతా కడప, నెల్లూరు జిల్లాలకు చెదినవారిగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

'జైలర్‌ 2'లో నందమూరి హీరో.. రజనీకాంత్‌తో స్క్రీన్ షేరింగ్..?

బెంగుళూరు రేవ్ పార్టీ : సినీ నటి హేమ మా నుంచి సస్పెండ్?

2024 ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ జబర్దస్త్ షోకు ఆర్కే రోజా?

విజయ్ సేతుపతి 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజా

విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ కొత్త మిషన్ బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై విల్ విల్ రిలీజ్

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?

'మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్‌'లో టైమ్‌లెస్ బ్యూటీగా చెన్నై మహిళ

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments