వైసిపికి ఇదే చివరి ఛాన్స్: యనమల

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (07:59 IST)
రాష్ట్ర నూతన కమిటి సభ్యులను పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అభినందించారు. కొత్త కమిటిలో 61% పదవులు బిసి,ఎస్సీ,ఎస్టి ముస్లిం మైనారిటీలకే ఇవ్వడం ముదావహం అన్నారు.

బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం అనేది మరోసారి రుజువైంది. నూతన కమిటి టీమ్ స్పిరిట్ తో పని చేయాలని, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. 

‘‘టిడిపిపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించి వైసిపి అధికారంలోకి వచ్చింది. ఒక్కఛాన్స్ అని కాళ్లావేళ్లా పడి బతిమాలి, అధికారం పొందిన వైసిపి అనేక అరాచకాలకు పాల్పడి, అదే చివరి ఛాన్స్ చేసుకుంది.

బిసిలపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు-దౌర్జన్యాలతో అన్నివర్గాల ప్రజలకు దూరం అయ్యింది. పేదల సంక్షేమ పథకాల్లోనూ వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడింది.

వాటాల కోసం బెదిరించి పారిశ్రామిక వేత్తలను తరిమేసింది, యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టింది. వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. రైతులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, కులవృత్తులవారు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని’’ యనమల రామకృష్ణుఢు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments