Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపికి ఇదే చివరి ఛాన్స్: యనమల

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (07:59 IST)
రాష్ట్ర నూతన కమిటి సభ్యులను పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అభినందించారు. కొత్త కమిటిలో 61% పదవులు బిసి,ఎస్సీ,ఎస్టి ముస్లిం మైనారిటీలకే ఇవ్వడం ముదావహం అన్నారు.

బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం అనేది మరోసారి రుజువైంది. నూతన కమిటి టీమ్ స్పిరిట్ తో పని చేయాలని, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. 

‘‘టిడిపిపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించి వైసిపి అధికారంలోకి వచ్చింది. ఒక్కఛాన్స్ అని కాళ్లావేళ్లా పడి బతిమాలి, అధికారం పొందిన వైసిపి అనేక అరాచకాలకు పాల్పడి, అదే చివరి ఛాన్స్ చేసుకుంది.

బిసిలపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు-దౌర్జన్యాలతో అన్నివర్గాల ప్రజలకు దూరం అయ్యింది. పేదల సంక్షేమ పథకాల్లోనూ వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడింది.

వాటాల కోసం బెదిరించి పారిశ్రామిక వేత్తలను తరిమేసింది, యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టింది. వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. రైతులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, కులవృత్తులవారు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని’’ యనమల రామకృష్ణుఢు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments