Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపికి ఇదే చివరి ఛాన్స్: యనమల

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (07:59 IST)
రాష్ట్ర నూతన కమిటి సభ్యులను పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అభినందించారు. కొత్త కమిటిలో 61% పదవులు బిసి,ఎస్సీ,ఎస్టి ముస్లిం మైనారిటీలకే ఇవ్వడం ముదావహం అన్నారు.

బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం అనేది మరోసారి రుజువైంది. నూతన కమిటి టీమ్ స్పిరిట్ తో పని చేయాలని, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. 

‘‘టిడిపిపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించి వైసిపి అధికారంలోకి వచ్చింది. ఒక్కఛాన్స్ అని కాళ్లావేళ్లా పడి బతిమాలి, అధికారం పొందిన వైసిపి అనేక అరాచకాలకు పాల్పడి, అదే చివరి ఛాన్స్ చేసుకుంది.

బిసిలపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు-దౌర్జన్యాలతో అన్నివర్గాల ప్రజలకు దూరం అయ్యింది. పేదల సంక్షేమ పథకాల్లోనూ వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడింది.

వాటాల కోసం బెదిరించి పారిశ్రామిక వేత్తలను తరిమేసింది, యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టింది. వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. రైతులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, కులవృత్తులవారు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని’’ యనమల రామకృష్ణుఢు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments