Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరి పట్టణంలో దొంగలు.. మహిళ ఉపాధ్యాయురాలు హత్య

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:15 IST)
కదిరి పట్టణంలో వేకువజామునే దొంగలు బీభత్సం సృష్టించారు. ఉదయం రెండు ఇళ్లల్లోకి చొరబడి ఇద్దరు మహిళల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం ఓ మహిళ ఉపాధ్యాయురాలును హత్య చేశారు. మరో మహిళపై దాడి చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో నివాసముండే శంకర్‌ రెడ్డి ఉష దంపతులు భర్త ఉదయం వాకింగ్‌ కోసం వెళ్లిన సమయంలో చోరీకి వచ్చిన దుండగులు ఉషా(45 )పై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 
 
అనంతరం పక్కన ఉండే ఇంటికి ప్రవేశించిన దుండగులు శివమ్మ అనే మహిళ పై దాడి చేసి ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. దొంగలను రాకను గుర్తించి బయటికి రాబోయిన శివమ్మ కుమారుడు కోడలిని గదిలోనే బంధించారు. దాడిలో శివమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఉదయం పని నిమిత్తం ఇంట్లోకి వచ్చిన పని మనిషి చూసి శివమ్మ కుమారుడు కోడలు ఉన్న గది తెరిచింది. అనంతరం బయటకు వచ్చిన వారు శివమ్మను వైద్యం నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments