Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో యేడాదిన్నరగా ఇంటిలోనే బక్కచిక్కి...

Webdunia
గురువారం, 22 జులై 2021 (22:28 IST)
స్టే హోం.. స్టే సేఫ్ అనే నినాదాన్ని బాగా పాటించినట్లుంది ఆ కుటుంబం. అందుకేనేమో యేడాదిన్నర నుంచి కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వస్తుందన్న భయంతో వారు ఇంటిలోనే ఉండిపోయారట. ఈ విషయాన్ని వైద్యులకు స్వయంగా వారే చెప్పారు. 
 
తూర్పుగోదావరిజిల్లా రాజోలు మండలం కడలి ప్రాంతానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు ఇంటిలోనే ఉండిపోయారు. ఇంటిలో ఉన్న తండ్రీకొడుకు మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చి కావాల్సిన సామగ్రి తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవారు.
 
ఎంతో జాగ్రత్తగా వీరిద్దరు కూడా బయటకు వచ్చేవారు. అయితే వీరికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు మంజూరైంది. వేలిముద్ర వేయాలని వాలంటీర్ వీరు నివాసమున్న ఇంటి దగ్గరకు వచ్చింది. 
 
వారిని చూసి వాలంటీర్ ఆశ్చర్యపోయింది. మహిళలు బక్కచిక్కి కనిపించడంతో ఆ వాలంటీర్ ప్రశ్నించింది. అసలు విషయాన్ని వారు చెప్పడంతో స్థానిక నాయకుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళింది. దీంతో వారు ఆ ఐదుమందిని ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా బక్కచిక్కిపోవడంతో వారికి చికిత్స చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments