కరోనా భయంతో యేడాదిన్నరగా ఇంటిలోనే బక్కచిక్కి...

Webdunia
గురువారం, 22 జులై 2021 (22:28 IST)
స్టే హోం.. స్టే సేఫ్ అనే నినాదాన్ని బాగా పాటించినట్లుంది ఆ కుటుంబం. అందుకేనేమో యేడాదిన్నర నుంచి కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వస్తుందన్న భయంతో వారు ఇంటిలోనే ఉండిపోయారట. ఈ విషయాన్ని వైద్యులకు స్వయంగా వారే చెప్పారు. 
 
తూర్పుగోదావరిజిల్లా రాజోలు మండలం కడలి ప్రాంతానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు ఇంటిలోనే ఉండిపోయారు. ఇంటిలో ఉన్న తండ్రీకొడుకు మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చి కావాల్సిన సామగ్రి తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవారు.
 
ఎంతో జాగ్రత్తగా వీరిద్దరు కూడా బయటకు వచ్చేవారు. అయితే వీరికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు మంజూరైంది. వేలిముద్ర వేయాలని వాలంటీర్ వీరు నివాసమున్న ఇంటి దగ్గరకు వచ్చింది. 
 
వారిని చూసి వాలంటీర్ ఆశ్చర్యపోయింది. మహిళలు బక్కచిక్కి కనిపించడంతో ఆ వాలంటీర్ ప్రశ్నించింది. అసలు విషయాన్ని వారు చెప్పడంతో స్థానిక నాయకుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళింది. దీంతో వారు ఆ ఐదుమందిని ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా బక్కచిక్కిపోవడంతో వారికి చికిత్స చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments